నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారా?

తెలంగాణలో తమ పార్టీ నాయకుడు చంద్రబాబు కన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని నాగం జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో కొంత మంది చిల్లరగాళ్లున్నారని నాగం చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో కలకలం రేపాయి. పైగా, తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినా వినబోనని, మిగతా విషయాల్లో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని నాగం పదే పదే అంటున్నారు. నాగం ఈ విధంగా వ్యవహరిస్తుండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ నాయకులు చంద్రబాబుతో అంటున్నట్లు సమాచారం. ఈ స్థితిలో నాగంపై చర్యలు తీసుకునే విషయంపై చంద్రబాబు దృష్టి సారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications