వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య స్థలంపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ayodhya Issue
న్యూఢిల్లీ: రామజన్మ భూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భవిష్యత్తులో అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పును ఇస్తే అదే విధంగా అందరూ నడుచుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి అలహాబాద్ హైకోర్టు తీర్పుపై మాత్రం స్టే విధిస్తున్నట్టు చెప్పింది. అయోధ్యలో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది.

సుప్రీంకోర్టులో వివిధ రాజకీయ పక్షాల అఫిడవిట్‌లపై విచారణకు సుప్రీంకోర్టు ఆమోదించింది. అలహాబాద్ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయోధ్య స్థలం విషయంలో వివాదం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే స్థలం కావాలని ఎవరూ కోరలేదని తేల్చి చెప్పింది. అలహాబాద్ కోర్టు తీర్పుపై కూడా సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

English summary
The Supreme Court has stayed the Allahabad High Court's verdict on the Ramjanmbhoomi-Babri Masjid title dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X