వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృత్వం కేసులో ఎన్‌డి తివారీకి చుక్కెదురు, రక్తనమూనాలపై ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwary
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీకి పితృత్వం కేసులో ఢిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనను తివారీ కుమారుడిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు వేసిన పిటిషన్‌పై విచారిస్తున్న హైకోర్టు రక్తం నమూనాలను ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. స్వయంగా వచ్చిన రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తివారీని మంగళవారం ఆదేశించింది. జూన్ 1వ తేదీలోగా రక్తం నమూనాలు ఇవ్వాలని సూచించింది.

రోహిత్ శేఖర్ తివారీకి పుట్టాడా, లేదా అని తేల్చడానికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకు గాను రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తివారీని ఆదేశించింది. అయితే, ఏదో కారణంతో తివారీని దాటేస్తూ వస్తున్నారు. తన రక్తం నమూనాలను పంపుతానని ఆయన చెప్పారు. అది కుదరదని, తివారీ స్వయంగా వచ్చి రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పింది. తన పరువును తీయడానికే ఈ విధమైన కేసు వేశారని తివారీ ఆరోపిస్తున్నారు. అయితే, తన తల్లితో వైవాహికేతర సంబంధం వల్ల తాను తివారీకి పుట్టానని, అందువల్ల తనను తివారీ పుత్రుడిగా ప్రకటించాలని రోహిత్ శేఖర్ అంటున్నాడు.

English summary
Delhi High court ordered Andhrapradesh dormer Governor ND Tiwary to give blood samples for DNA test in paternity case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X