వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా క్లే తవ్వకాలు వ్యతిరేకిస్తూ రాళ్ల దాడి, కత్తులతో ర్యాలీ పారిపోయిన ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: ప్రజలు ఏకమై తిరగబడితే ప్రజా ప్రతినిధులు గోచీ కట్టుకొని పరారు కాక తప్పదని మరోసారి రుజువు అయింది. విశాఖపట్నం జిల్లాలో చైనా క్లే తవ్వకాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. అయితే చైనా క్లే తవ్వకాలపై అరకు శాసనసభ్యుడు సోమ మంగళవారం స్థానికి సర్రాయిగూడలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారు. అయితే సమావేశం మధ్యలో గిరిజనులు ఒక్కసారిగా తవ్వకాలు జరగనిచ్చేది లేదని ఆందోళన చేశారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం లేదని గిరిజనులు హెచ్చరించారు.

అది కాస్త ఉద్రిక్తంగా మారింది. రెచ్చిపోయిన గిరిజనులు ఎమ్మెల్యే సోమపై దాడికి యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుండి పారిపోయారు. వారు ఆయన స్కార్పియో వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే ఎమ్మెల్యే వాహనం కాస్త దెబ్బతిన్నప్పటికీ ఆయనకు ఏమీ కాలేదు. ఎమ్మెల్యేతో పాటు వచ్చి డుంబ్రీగూడ ఎంపిపి దున్నేరావుపై కూడా గిరిజనలు దాడికి యత్నించారు. ఏజెన్సీలో చైనా క్లే తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు సర్రాయిలో సమావేశం ఏర్పాటు చేశారు. తవ్వకాలు జరిపితే బావుండదని హెచ్చరించారు. తవ్వకాలు అడ్డుకుంటామని కత్తులతో ర్యాలీ నిర్వహించారు.

English summary
Araku MLA ran away was ran away from a public meeting in Vishakapatnam. Scheduled cast people opposed MLA's people openion on Chaina clay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X