రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను ముందుగానే గమనించడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలును తక్షణమే నిలిపివేశారు. ప్రమాదానికి గురైన బోగీ నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

తిరువనంతపురం సెంట్రల్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 12431 రాజధాని ఎక్స్ ప్రెస్ అది. శుక్రవారం సాయంత్రం 7:15 నిమిషాలకు తిరువనంతపురం నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ చేరాల్సి ఉంది. మార్గమధ్యలో కోటా వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారు జామున అయిదు గంటల సమయంలో బీ1 కోచ్‌, ఇంజిన్ కంపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగాయి.

Emergency Evacuation After Flames Spotted in B1 Coach and Engine of Rajdhani Express Near Kota

ఆ వెంటనే ప్రయాణికులందరినీ వెంటనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడానికి కోటా స్టేషన్‌లో అమర్చిన ఆటోమేటెడ్ హూటర్ మోగడంతో స్థానిక రైల్వే యంత్రాంగానికి వెంటనే సమాచారం చేరింది. తక్షణమే స్యందించిన సీనియర్ రైల్వే అధికారులు, సహాయక బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రైలులో కేరళకు చెందిన పలువురు ప్రయాణికులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+