చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి లోయలో పడిన బస్సు: 12 మందికి తీవ్రగాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుపతిలో ఆదివారం ఓ ఆర్టీసి బస్సు తిరుమల లోయలో పడింది. మధ్యాహ్నం సమయంలో తిరుమల వెళుతున్న ఓ ఆర్టీసి బస్సు మొదటి ఘాట్ రోడ్డులోని జింకల పార్కు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. సుమారు పది అడుగుల లోయలో బస్సు పడింది. దీంతో బస్సులోని 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లడానికి, రావడానికి ఒకే దారి ఉంటుంది. కొండపైకి వెళ్లడానికి పలు మూలలు ఉంటాయి. ఇలాంటి సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోవడంతో మొదటి ఘాట్ రోడ్డులోని 44వ మలుపు వద్ద లోయలో పడినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ స్పీడ్ లిమిట్ కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తోంది.

English summary
12 devotees injured with accident in Tirumala. They sent to Tirupati hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X