ఆ పదవి వద్దు బాబోయ్ అన్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

కాగా కడప ఉప ఎన్నికలలో ఓటమిపై కాంగ్రెసు పార్టీ లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జగన్, విజయమ్మ భారీ ఆధిక్యంతో గెలవడంపై ఓసారి కాంగ్రెసు విశ్లేషించుకోవాలన్నారు. ఈ ఓటమికి ఎవరో కొంతమంది బాధ్యులని చేయడం భావ్యం కాదని, అందరూ సమిష్టిగా ఓటమిపై సునిశిత పరిశీలన జరపాలని అభిప్రాయపడ్డారు. టిడిపి పరిస్థితి కూడా కాంగ్రెసుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. కడప ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెసు జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications