ఆ పదవి వద్దు బాబోయ్ అన్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

Rosaiah
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తదనంతరం ముఖ్యమంత్రి పీఠం కూర్చున్న కొణిజేటి రోశయ్య మరోసారి ఆ పదవి వస్తే వద్దంటున్నారు. రోశయ్య కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మరోసారి ముఖ్యమంత్రి పదవి వస్తే తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన ససేమీరా అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సర కాలంలో అనేక ప్రకృతి వైపరీత్యాలను, ఉద్యమాలను ఎదుర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు సమస్యలపై బాగానే వర్క్ చేశారనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్య ఆయనకు కంటి మీద నిద్ర లేకుండా చేశాయి. ఆయనకు వయసు కూడా సహకరించక లేదు. అలాంటి పదవిపై మరోసారి కూర్చోవాలని లేదని మాత్రం చెబుతున్నారు.

కాగా కడప ఉప ఎన్నికలలో ఓటమిపై కాంగ్రెసు పార్టీ లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జగన్, విజయమ్మ భారీ ఆధిక్యంతో గెలవడంపై ఓసారి కాంగ్రెసు విశ్లేషించుకోవాలన్నారు. ఈ ఓటమికి ఎవరో కొంతమంది బాధ్యులని చేయడం భావ్యం కాదని, అందరూ సమిష్టిగా ఓటమిపై సునిశిత పరిశీలన జరపాలని అభిప్రాయపడ్డారు. టిడిపి పరిస్థితి కూడా కాంగ్రెసుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. కడప ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెసు జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+