Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటకలో మళ్లీ ముసలం: గవర్నర్, సిఎం మధ్య మళ్లీ మాటల యుద్ధం

BS Yeddyurappa-HR Bhardwaj
బెంగుళూరు: కర్ణాటకలో మళ్లీ గవర్నర్ భరద్వాజ్, ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మాటల యుద్ధం రాజుకుంది. రెండు రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక సభాపతి ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని తప్పు పట్టిన నేపథ్యంలో గవర్నర్, సిఎం మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. అవిశ్వాస తీర్మానంలో మెజార్టీ నిరూపణ కోసం ఓటింగ్ ప్రక్రియను రాజకీయ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని భరద్వాజ్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడవాలి. కానీ ప్రభుత్వం ప్రకారం రాజ్యాంగాన్ని మార్చరాదని యెడ్డీకి పరోక్షంగా హితవు పలికారు. శాసనసభలో ఓటింగ్ వల్ల ప్రయోజం లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

దీనికి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా ఘాటుగానే స్పందించారు. గవర్నర్ అవిశ్వాస తీర్మానం కోరితే తాను సిద్ధమని చెప్పారు. అవిశ్వాస పరీక్షలో బలం నిరూపించుకుంటానని చెప్పారు. విశ్వాస పరీక్ష అవసరం తమకు లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 121 ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన అన్నారు. తనకు ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ ఉందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+