కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి, ఉప ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీ

హోం శాఖ నుంచి పి. చిదంబరాన్ని తప్పించవచ్చునని అంటున్నారు. ఎస్ జైపాల్ రెడ్డి శాఖ మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు ప్రధాని ఉద్వాసన పలికే అవకాశాలున్నాయి. దిగ్విజయ్ సింగ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే తృణమూల్ కాంగ్రెసు నేత, రైల్వే మంత్రి మమతా బెనర్జీ స్థానంలో అదే పార్టీకి చెందిన ముకుల్ రాయ్ని నియమిస్తారని అంటున్నారు. మమతా బెనర్జీ స్థానంలో తృణమూల్కు మరో మంత్రి పదవి దక్కుతుంది.
డిఎంకెకు చెందిన అళగిరికి స్థానచలనం తప్పదని అంటున్నారు. అందుకు డిఎంకె అధినేత కరుణానిధి ఇష్టపడకపోతే పరిస్థితి మారే అవకాశాలున్నాయి. మంత్రివర్గంలో చేరాలని డిఎంకెపై ఒత్తిడి చేయకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. డిఎంకె తప్పుకుంటే వెంటనే జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications