నేను జగన్‌కు అనుకూలమనడం సీమాంధ్రుల కుట్ర: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తల వెనక సీమాంధ్రుల కుట్ర ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తన ప్రాణాలు ఉన్నంత వరకు తెలంగాణ కోసం పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 21వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగే తెలంగాణ నగారా సభలో పార్టీ జెండా పెట్టాలనే వాదనను ఆయన తిరస్కరించారు.

ఈ నెల 21వ తేదీన పరిగిలో తెలంగాణ నగారా సభ జరిగి తీరుతుందని తెలుగుదేశం శానససభ్యుడు హరీశ్వర్ రెడ్డి చెప్పారు. పార్టీ జెండా లేకుండానే ఈ సభను నిర్వహిస్తామని, పార్టీ జెండా లేకుండా సభ జరుగుతుందని ప్రకటించినందున వెనక్కి తగ్గలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ సభకు అన్ని పార్టీలను, తెలంగాణ ప్రజా సంఘాలను, విద్యార్థులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. పార్టీ జెండా పెడితే సభకు ఎవరూ రారని ఆయన అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు చేస్తున్న పాదయాత్రకు ఎవరూ రాకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ జెండా లేకుండా పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో తాము పాల్గొంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+