జగన్ ఎమ్మెల్యేల పని అంతేనా: రాజ్యాంగ నిపుణులతో చర్చలు

గత కొద్ది నెలలుగా ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క తిరుగుబాటు శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు కాదని ఆయన వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం విధిస్తారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఫిరాయింపుల నిరోధక చట్టంపై పూర్తి వివరణ కోసం వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే హక్కు ఎన్నికల కమీషన్కు లేదా ఎన్నికల ట్రిబ్యునల్కు మాత్రమే ఉంటుందని, అటువంటి హక్కు స్పీకర్కు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. స్పీకర్ అనర్హత వేటు మాత్రమే వేయగలరని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications