2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే ఎంపీ కనిమొళి బెయిల్ పిటిషన్పై తీర్పు నేడే
National
oi-Nageshwara Rao M
By Nageswara Rao
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎంపీ కనిమొళి బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మే 14న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కనిమొళి బెయిల్ పిటిషన్పై తీర్పును నేటికి వాయిదా వేసింది. కోర్టు ఒకవేళ బెయిల్కు నిరాకరిస్తే ఆమెను తీహార్ జైలుకు పంపే అవకాశం ఉంది. కళైంజర్ టీవీ ఎండీ శరత్కుమార్ బెయిల్ పిటిషన్పైనా ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ ఒపీ సైనీ నేడు తీర్పు ఇవ్వనున్నారు.
A special Central Bureau of Investigation (CBI) court will pronounce its verdict on the bail plea of Dravida Munnetra Kazhagam ( DMK )) lawmaker Kanimozhi in the 2G spectrum case.