హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎంఐఎం శానససభ్యుడు అక్భరుద్ధీన్ ఓవైసీ పూర్తిగా కోలుకున్నారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల బార్కాస్‌లో దాడికి గురై చికిత్స పొందిన అక్భరుద్ధీన్ శుక్రవారం కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్‌ను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ను చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. వారిని సముదాయించి, అక్బరుద్దీన్‌ను తీసుకుని వెళ్లడం కష్టంగానే మారింది.

బార్కాస్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన అక్బరుద్ధీన్ ఒవైసీపై గత ఎన్నికల్లో ఎంబీటీకి మద్దతిచ్చిన మహ్మద్ పహిల్వాన్ అతని బావమరిదులు, ఇద్దరు మేనల్లుళ్లు దాడికి పాల్పడ్డారు. భూవివాదంతో జరిగిన దాడిలో అక్భరుద్ధీన్‌ కడుపు, మూత్రనాళాలు, దవడపై గాయాలు తగిలాయి. కిడ్నీ పాడవడంతో నాలుగు బుల్లెట్లను ఒవైసీ శరీరం నుంచి తొలగించిన కేర్ ఆస్పత్రి వైద్యులు, ఆయనకు డయాలసిస్ చికిత్స అందించారు.

వైద్యులు అందించిన చికిత్సతో పూర్తిగా కోలుకున్న అక్భరుద్ధీన్ శుక్రవారం కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి ఘటన సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు.

English summary
MIM MLA Akbaruddin Owaisi discharged from Care hospital in Hyderabad today. He was seriously injured in an attack in Hyderabad old city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X