వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రత్నాకర్ సహా ముగ్గురికి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు చెక్ పవర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టవర్తి‌: ఊహాగానాలకు తెర దించుతూ ఇద్దరికి కాకుండా ముగ్గురికి చెక్ పవర్‌ను ఇస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ముగ్గురిలో ఇద్దరు సంతకం చేసినా చెక్ చెల్లుతుందని ట్రస్టు చెప్పింది. సత్యసాయి బాబా సోదరుడి కుమారుడు ఆర్‌జె రత్నాకర్, వి. శ్రీనివాసన్, ఎస్‌వి గిరిలకు చెక్ పవర్ ఇచ్చారు వి. శ్రీనివాసన్ సత్య సాయి సంస్థల జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

జస్టిస్ పిఎన్ భగవతి అధ్యక్షతన ట్రస్టు సభ్యులు గురువారం ఉదయం ప్రశాంతినిలయంలో సమావేశమయ్యారు. సత్య సాయిబాబా శాశ్వత చైర్మన్‌గా ఉంటారని ట్రస్టు బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్యదర్శి కె. చక్రవర్తి సహా ట్రస్టీలు, యాజమాన్య మండలి సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కాగా, సత్య సాయిబాబా తల్లి ఈశ్వరమ్మ వర్ధంతిని ట్రస్టు ఘనంగా నిర్వహించింది.

English summary
Putting an end to the ongoing speculation, the Sri Sathya Sai Central Trust has decided that not two but three trustees will have the cheque signing powers. In an important decision taken at the trust board meeting here on Thursday, the trust , however, said the cheque would be valid even if two among the three members sign it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X