చంద్రబాబు చేత తెలంగాణపై ప్రకటన చేయించాల్సిందే: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: తెలంగాణ అనుకూలంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేత స్పష్టమైన ప్రకటన చేయించాల్సిందేనని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ రణభేరీ సభలో తీర్మానం చేయాలని కూడా ఆయన సూచించారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ మహానాడులో కూడా తీర్మానం చేయించాలని, తెలంగాణ అమరవీరులకు సంతాపం ప్రకటిస్తూ తీర్మానం ప్రతిపాదింపజేయాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. అలా చేయకుండా సభలు పెడితే ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు. కరీంనగర్ రణభేరీ సభ వల్ల ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు.

తాను పెట్టిన సభలు పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గానీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అనుకూలంగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇవ్వాలని అడిగితే వ్యతిరేకం ఎలా అవుతుందని ఆయన అడిగారు. తెలంగాణ నాయకులు సీమాంధ్ర పార్టీలను బతికించాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నేతలు తమ పార్టీలోనే కాదు, కాంగ్రెసులోనూ ఉన్నారని ఆయన విమర్శించారు. మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ సాధనకు ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తే తప్ప పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

పిఎసి చైర్మన్‌గా కొనసాగాలని అనుకుంటే తాను చంద్రబాబు వెన్నంటి ఉండేవాడినని ఆయన అన్నారు. తాను నివేదిక సమర్పించి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. ఐదు వేల కోట్ల రూపాయల రికవరీకి తాను పిఎసి నివేదికను సమర్పించానని, దాన్ని ప్రచురించి బయటపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+