మధ్యప్రదేశ్ గవర్నర్గా రోశయ్య, రేపు సోనియా గాంధీతో భేటీ?
రోశయ్య ఇటీవల కాంగ్రెసు పరిస్థితిపై కాస్తా ఘాటుగానే మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియాకు ఆయన ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం పెద్దలు రోశయ్యతో మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, రెండో సారి ముఖ్యమంత్రి కావడానికి కూడా రోశయ్య ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇటీవల రాసింది. ముఖ్యమంత్రి మారడం వల్ల పరిస్థితి మారదని ఆయన ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో అనడాన్ని ఆవకాశంగా తీసుకుని ఆ పత్రిక ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
హైదరాబాదులోని అమీర్పేట భూకుంభకోణం రోశయ్య గవర్నర్గిరీకి ఆటంకాలు ఏర్పడతాయా అనేది అనుమానంగా ఉంది. ఈ కేసును పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేసుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎసిబి కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎసిబి కోర్టు రోశయ్య పేరును క్లియర్ చేయడానికి మరో వారం రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయనను మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమించే అవకాశాలున్నాయి.