హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ సెంట్రల్ గవర్నెన్స్ సమావేశం, వైయస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ సెంట్రల్ గవర్నెన్స్ సమావేశం సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటి సారి అధికారికంగా భేటీ అయింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు తదితరాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ ముసాయిదా తయారు చేసే సోమయాజులు కూడా పాల్గొన్నారు. ఆయన 1994 నుండి 2004 వరకు కాంగ్రెసు పార్టీకి పని చేశారు.

సమావేశానికి ముందు ఆయన మాట్లాడుతూ పథకాలు కాంగ్రెసు పార్టీవి కావని కేవలం వైయస్ రాజశేఖరరెడ్డివే అన్నారు. కాంగ్రెసు పార్టీ పథకాలు అయితే జాతీయస్థాయిలో కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశ పెట్టలేదన్నారు. జగన్ వెంట వెళుతున్న కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చారు. మాజీ మంత్రులు బాలరాజు, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఎమ్మెల్యేలు పి.రవి, ధర్మాన కృష్ణదాసు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పిఆర్పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు జగన్‌ను కలిసినవారిలో ఉన్నారు.

English summary
Pilli Subash Chandra Bose, Shoba Nagi Reddy, Dharmana Krishnadasu were participated in YS Jagan's YSR congress party central governance meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X