వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాలకు సిఎం క్లాస్

Konathala Ramakrishna
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్ జగన్ రాసిన వినతిపత్రం సమర్పించేందుకు కొణతాల రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి కార్యలయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. "గతంలో మీరూ మంత్రిగా పని చేశారుగా? అప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు లేవా? నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2008 నుంచి ఇప్పటివరకూ ఉన్న బకాయి రూ.1300 కోట్లను ఒక్కసారిగా చెల్లించాను. గత ఏడాది డిసెంబర్‌కు సంబంధించి దాదాపు రూ.650 కోట్లను కూడా రైతు సదస్సుల్లో చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశాం'' అని కొణతాల రామకృష్ణతో అన్నారు.

దానితో ఆగకుండా ''రైతులకు, మహిళలకు ఇస్తున్న వడ్డీ రాయితీ విషయంలోనూ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? రుణం తీసుకున్న వారు ఒక్క రూపాయి బకాయి చెల్లించకపోయినా.. ప్రభుత్వం రూ.650 కోట్ల నిధులను విడుదల చేస్తోంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదంటే ఎలా? మీరూ మంత్రిగా చేశారుగా!!'' అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+