వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్‌దేవ్ డిప్యూటీ అదృశ్యం, తలెత్తిన కొత్త వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: యోగా గురు రామ్‌దేవ్ సత్యాగ్రహం విషయంలో కొత్త వివాదం ముందుకు వచ్చింది. ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసిన బాబా రామ్‌దేవ్ సహాయకుడు కనిపించుకుండా పోయాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం బహిర్గతం చేసిన మర్నాడు జూన్ 4వ తేదీ నుంచి రామ్‌దేవ్ కుడి భుజంగా భావించే ఆచార్య బాలకృష్ణ కనిపించడం లేదు. శనివారం సాయంత్రం 4 గంటలకు దీక్షను విరమిస్తానని రామ్‌దేవ్ శిబిరం చెప్పింది. అది జరగకపోవడంతో లేఖను బయటపెడతామని ప్రభుత్వం చెప్పింది.

ప్రతి రోజూ కొత్త డిమాండ్లను రామ్‌దేవ్ ముందుకు తెస్తున్నారని, తర్వాత లేవనెత్తిన అంశాలు తమకు పంపిన సమాచారంలో లేవని ప్రభుత్వం చెప్పింది. బాలకృష్ణ నేపాలీ నేరస్థుడని, ఇండియన్ పాస్‌పోర్టును అతను ఫోర్జ్ చేశాడని కాంగ్రెసు ఆరోపించింది. బాబా పక్కన కనిపించే బాలకృష్ణ నేపాల్ పౌరడని, అతను నేరస్థుడని, భారత దేశంలో తలదాచుకుంటున్నాడని, అతనికి పాస్‌పోర్టు ఎలా వచ్చిందో విచారణ జరపాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.

రుజువులు లేకుండా బాలకృష్ణపై కొంత మంది బురద చల్లుతున్నారని, బాలకృష్ణ క్షేమంగా ఉన్నాడని, మిషన్ పనిలో బిజీగా ఉన్నాడని బాబా రామ్‌దేవ్ అన్నారు. తనను నాశనం పట్టించడంపై కేంద్రం ఎక్కువ దృష్టి పెడుతోందని ఆయన అన్నారు.

English summary
Fresh controversy has surfaced concerning Baba Ramdev's aide, who allegedly signed the deal with the government. Acharya Balakrishna, considered Baba's right-hand man, has been missing since June 4 -- the day the government made the deal public, reported Times Now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X