వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి చీఫ్‌గా బొత్స సత్యనారాయణ, సోనియా, ఆజాద్‌లతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవి మంత్రి బొత్స సత్యనారాయణకు దక్కింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెసు పార్టీ అధిష్టానం బొత్స సత్యనారాయణ వైపే మొగ్గు చూపింది. పిసిసి అధ్యక్షుడిగా ఆయనను ఎంపిక చేసింది. ఇంతకు ముందు బొత్స సత్యానారాయణ పేరు తెర మీదికి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించడంతో వెనక్కి వెళ్లినట్లు భావించారు. ముఖ్యమంత్రి మంత్రి కన్నా లక్ష్మినారాయణ పేరుతో పాటు మంత్రి శీధర్ బాబు పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. మధ్యలో ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది.

ఎందరు పోటీ పడినా చివరికి పిసిసి చీఫ్ పదవి బొత్స సత్యనారాయణను వరించింది. బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఉత్తరాంధ్రకు చెందినవారు కావడం కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బొత్స సత్యనారాయణకు మద్దతు తెలిపారు.తన పేరు పిసిసి చీఫ్ పదవికి ఖరారు కావడం వల్లనే బొత్స సత్యనారాయణ సోమవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిసినట్లు చెబుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తి కావడంతో కాంగ్రెసు అధిష్టానం పిసిసి చీఫ్ పదవిపై, ప్రజారాజ్యం పార్టీ విలీనంపై దృష్టి పెట్టింది. బొత్స సత్యనారాయణ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

English summary
It is said that Botsa Satyanarayana may be appointed as PCC chief. Botsa Satyanarayana met Sonia Gandhi and Azad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X