రైల్వే శాఖపై కన్నేసిన చిరంజీవి, రాష్ట్ర మంత్రి పదవులపైనా పట్టు

రైల్వే శాఖను తృణమూల్ కాంగ్రెసుకే ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకుంది. మమతా బెనర్జీ కూడా అదే కోరుతున్నారు. అందువల్ల రైల్వే శాఖ ఇవ్వడం కుదరనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో చిరంజీవి అతి ముఖ్యమైన శాఖను కేటాయించడానికి కూడా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. తొలిసారి మంత్రి పదవి చేపడుతున్న చిరంజీవికి కీలకమైన శాఖ ఇస్తే ఇబ్బందులు ఎదురు కావచ్చునని అనుకుంటోంది. రాష్ట్రంలో కన్నబాబు వంటి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెసులో అసంతృప్తి సెగలు రాజుకునే ప్రమాదం ఉందని కూడా అనుకుంటోంది.
చిరంజీవి ఈ స్థితిలో సోమవారం సాయంత్రం మరోసారి రాష్ట్ర కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో సమావేశమవుతున్నారు. మంత్రి పదవుల విషయంలో కాంగ్రెసు అధిష్టానం వద్ద పట్టు సడలించకూడదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లోనే తగిన స్థానాలను సంపాదించుకుంటే అది కొనసాగుతుందని, మొదట్లోనే రాజీ పడితే అది నిరంతరం కొనసాగుతుందని చిరంజీవి భావిస్తున్నారు. ఏమైనా, కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీన ప్రక్రియ పద్ద తతంగానే మారింది.












Click it and Unblock the Notifications