తెలంగాణను మరో కడపలా మార్చవద్దు, రాష్ట్రం ఇవ్వాలి: కెకె

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణను మరో కడపలా మార్చవద్దని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు తమ పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరారు. రాష్ట్రం ఇస్తే తెలంగాణలో వంద శానససభా స్థానాలు గెలుస్తామని, ఇవ్వకపోతే పది సీట్లు కూడా రావని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ చాలా క్లిష్టమైన అంశమనే విషయం తమకు తెలుసునని, అది అత్యంత సున్నితమైన అంశమని కూడా తెలుసునని, అందుకే ఆ అంశానన్ని కాంగ్రెసు కోర్ కమిటీలో పెట్టామని ఆయన అన్నారు. తెలంగాణ అంశం జఠిలమైందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అనడంపై ఆయన స్పందిస్తూ ఆ విధంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ కార్యాచరణకు జులై మొదటి వారంలో పదును పెడుతామని ఆయన చెప్పారుయ

తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించుకోవడమే తమ లక్ష్యం కాబట్టి అందుకు తగిన ప్రణాళికను రచిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ సాధించుకోవాలనే పట్టుదల, పోరాట పటిమ తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసుకు కడపలో పట్టిన గతే తెలంగాణలో పడుతుందని ఆయన అన్నారు. పిసిసి చీఫ్ ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే మంచిదని ఆయన అన్నారు. ఈ నెల పదో తేదీన తెలంగాణ కోసం అధిష్టానాన్ని కలుస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+