బస్సు ప్రమాదంలో 23 మంది మృతి, తమిళనాడులో ఘోరం

ప్రమాద స్థలికి ప్రధాన ప్రాంతాలు దూరంగా ఉండటంతో అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకోవడానికి ఆసల్యమైంది. బస్సు బోల్తాపడిన స్థలం ముళ్ల పొదలతో కూడిన పెద్ద గుంతగా ఉండటంతో అందులో నుంచి మృతులను బయటకు తీసేందుకు సమయం పట్టింది. ఒంటి గంట సమయంలో జిల్లా కలెక్టరు నాగరాజన్ తదితర జిల్లా ఉన్నతాధికారులు ప్రమాద స్థలికి చేరుకొన్నారు. అప్పటి వరకు ఇంకా బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీయలేదు. ప్రమాదం కారణంగా చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిలో ప్రమాద స్థలి నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు ఇరు వైపులా రాకపోకలు స్తంభించాయి. డ్రైవర్ నాగరాజన్, మరో ప్రయాణికుడు చెన్నైకి చెందిన రాజా ప్రాణాలతో బయటపడ్డారు.












Click it and Unblock the Notifications