హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవిశ్వాసంపై టిడిపి వెనక్కి తగ్గితే నోటీసు మేమిస్తాం: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం అవుతున్న కాంగ్రెసు ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ఇవ్వడానికి వెనక్కి తగ్గితే తామే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిపై సిపిఐ ఇక ఉద్యమ బాట పడుతుందని ఆయన చెప్పారు. కేంద్రం అవినీతిపై ఈ నెల 11న అనంతపురంలో, 15న నిజాం కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.

కాగా తమకు కొత్త మిత్రులను వెతుక్కోవాల్సిన అవసరం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వేరుగా వ్యాఖ్యానించారు. మాకోసం వారే వెతుక్కోవాలని అన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన బాధ్యతా రాహిత్యంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని మార్చలేరన్నారు. ముంచినా తేల్చినా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లే అన్నారు.

English summary
CPI state secretory Narayana said that they will give no confidence notice to speaker if TDP step back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X