చంద్రబాబు లేఖ ఇస్తే కాంగ్రెసును చెడుగుడు ఆడుకుంటా: నాగం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యానికి కారణం ఏంటో చెప్పాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులను బలిగొన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీయే మా మొదటి లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకతీతంగా తెలంగాణ ఎజెండాపై పాల్గొనాలన్నారు. అలా చేస్తేనే కేంద్రానికి వణుకు పుడుతుందన్నారు. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ ఇస్తే కాంగ్రెసును చెడుగుడు ఆడి రాష్ట్రాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications