చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుపిఎతో కరుణానిధి తెగదెంపులు?, 13న ఢిల్లీకి జయలలిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచి కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె వైదొలిగే అవకాశాలున్నాయి. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వరుసగా తమ పార్టీ నాయకుల మెడకు చుట్టుకుంటుండడంతో డిఎంకె యుపిఎపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనిపై చర్చించడానికి శుక్రవారం సాయంత్రం డిఎంకె కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కరుణానిధితో పాటు పలువురు సీనియర్ నాయకులు వచ్చారు. యుపిఎకు మద్దతు కొనసాగించాలా, ఉపసంహరించుకోవాలా అనే అంశంపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. అయితే, నిర్ణయాన్ని కరుణానిధికి అప్పగిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె నేతలు ఎ రాజా, కనిమొళిలు ఇప్పటికే జైలు పాలయ్యారు. మరో నేత దయానిధి మారన్ మెడకూ అది చుట్టుకుంటోంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇప్పటికే దయానిధి మారన్‌కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. డిఎంకె యుపిఎ నుంచి వైదొలిగే అవకాశాలున్న నేపథ్యంలో అన్నాడియంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆమె ప్రధాని మన్మోహసింగ్‌ను, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలుస్తారు.

English summary
It is learnt that Karunanidhi lead DMK may pull out from UPA. DMK core committee decided put responsibility on Karunanidhi to take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X