తెలంగాణ రాష్ట్రం రావాలని లేదా: కెసిఆర్, కిషన్రెడ్డిలకు ఎర్రబెల్లి ప్రశ్న
కెసిఆర్ కాంగ్రెసు ఏజెంటు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ కెసిఆర్ ఏజెంటు అని ఆయన ఆరోపించారు. కెసిఆర్ కబందహస్తాల నుండి కోదండరామ్ బయట పడాలన్నారు. కెసిఆర్, కిషన్ రెడ్డిలతో సహా తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలలో పాల్గొనమని ముందుకు వస్తే అందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ కోసం టిడిపి రాజీనామాకు కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా అందుకు ముందుకు రావాలన్నారు. టిఏజెఏసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని లేదంటే మేమే ఏర్పాటు చేస్తామని ఆ సమావేశానికి ఎవరు రాకున్నా తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.
errabelli dayakar rao k chandrasekhar rao kishan reddy telangana hyderabad ఎర్రబెల్లి దయాకర రావు కె చంద్రశేఖర రావు కిషన్ రెడ్డి తెలంగాణ హైదరాబాద్
English summary
TDP senior MLA Errabelli Dayakar Rao questioned TRS president K Chandrasekhar Rao and BJP president Kishan Reddy on Telangana.
Story first published: Friday, June 10, 2011, 15:24 [IST]