హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ నుండి సత్తిబాబుకు: పిసిసి బాధ్యతలు స్వీకరించిన బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా బొత్స సత్యనారాయణ శనివారం మధ్యాహ్నం 11 గంటల 11 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు. మాజీ పిసిసి పీఠాధిపతి డి శ్రీనివాస్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు. విజయనగరం జిల్లా నుండి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి భారీగా తరలి వచ్చిన సత్తిబాబు అభిమానులతో గాంధీ భవన్ కిటకిటలాడింది.

కాగా అంతకుముందు తన ఇంటి వద్ద నుండి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భారీ ర్యాలీతో బయలు దేరారు. మార్గమధ్యంలో దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, జగ్ జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి గాంధీభవన్ చేరుకున్నారు. కొత్త సారథి కోసం గాంధీ భవన్ సర్వాంగ సుందరంగా తయారయింది. గత పిసిసి అధ్యక్షులు ఎవరూ చేపట్టనంత ఆర్భాటంగా బొత్స పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. బొత్సతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. బొత్స ర్యాలీ కారణంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

English summary
Former PCC chief D Srinivas handed over to Botsa Satyanarayana today in Gandhi Bhavan of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X