వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి కెసిఆర్ రాజీనామా, పార్లమెంటు సమావేశాలే వేదిక?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులైలో జరిగే పార్లమెంటు సమావేశాలను ఆయన వేదికగా మార్చుకునే అవకాశాలున్నాయి. డెడ్‌లైన్లకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెసు తెలంగాణ నేతలు అంటున్నారు. అయితే తెరాస ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామాలు చేస్తామని, అందరం కలిసి తెలంగాణ జెఎసి కింద పోటీ చేద్దామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అంటున్నారు. రాజీనామాలకు తెలంగాణ జెఎసి జూన్ 25వ తేదీ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది.

కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు రాజీనామాలకు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థితిలో తెలంగాణ కోసం రాజీనామా చేసే దమ్ము వారికి లేదని ధ్వజమెత్తుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కేసీఆర్ రాజీనామాకు సిద్ధపడతారంటున్నా రు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన కేసీఆర్ మరోసారి రాజీనామా చేయడం ద్వారా తెలంగాణపై తమకే చిత్తశుద్ధి ఉందని చాటి చెబుతారన్నది సమాచారం. గత మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజీనామాకు సిద్ధపడ్డ కేసీఆర్‌ను జేఏసీనే నిలువరించినట్లు సమాచారం.

English summary
It is said that TRS president KCR may resign as Loksabha membership demanding formation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X