కోమటిరెడ్డి డెడ్లైన్, కాదన్న గుత్తా: తెలంగాణపై టి-కాంగ్రెసు తలోమాట
కాగా వీరికి భిన్నంగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సాధన కోసం తాము ఎన్నిసార్లు అయిన అధిష్టానంతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ సాధనలో ఇదే తమ ఆఖరి యాత్ర అని చెప్పలేమన్నారు. కేంద్ర మంత్రి ప్రణబ్తో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఎంపి వివేక్ స్పష్టం చేశారు. అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కాగా పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్, రాజయ్య మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ్యులు రాంరెడ్డి దామోదరరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, కెఎల్ఆర్ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లారు.
Comments
English summary
T-congress leaders giving different statements on Telangana issue. Komatireddy brothers put deadlint to high command, whether MP Gutta said he is not confirmed that it is last tour for Telangana.
Story first published: Wednesday, June 15, 2011, 10:03 [IST]