వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీలాగా బహిరంగంగా ముందుకు రాలేను: తెలంగాణపై జైపాల్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
న్యూఢిల్లీ: తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధుల మాదిరిగా తాను బహిరంగంగా ముందుకు రాలేనని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన గురువారం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో చెప్పారు. తాను కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నందున బహిరంగంగా ముందుకు రావడం సాధ్యం కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానం పెద్దలతో సమావేశం కావడానికి ఢిల్లీ వచ్చిన ప్రజాప్రతినిధులకు ఆయన గురువారం మధ్యాహ్నం తన నివాసంలో విందు ఇచ్చారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమానికి జైపాల్ రెడ్డి ఇప్పటి వరకు పరోక్షంగా సహకరించారని, ఇక ప్రత్యక్షంగా ముందుకు వస్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కె. లక్ష్మారెడ్డి చెప్పారు. జైపాల్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చిన జైపాల్ రెడ్డి ఈసారి కాస్తా సన్నిహితంగా మెలిగారు. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తన నివాసంలో ఇచ్చిన విందుకు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన అల్పాహార విందుకు హాజరు కావడమే కాకుండా స్వయంగా తాను విందు ఇచ్చారు.

English summary
Union Minister S Jaipal Reddy said to the Congress Telangana leaders that he can not come openly on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X