హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనా భూభాగంలో చిక్కుకున్న మంత్రి కన్నా, ఎమ్మెల్యే అవతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanna Laxminarayana
హైదరాబాద్: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చైనా భూభాగంలో చిక్కుకు పోయారు. మూడు రోజుల క్రితం మౌంట్ కైలాష్ యాత్రకు మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తో పాటు కన్నా ఇద్దరు తనయులతో పాటు మరో పది మంది వెళ్లారు. మొత్తం 14 మంది యాత్రకు వెళ్లారు. వీరిని సదరన్ ట్రావెల్స్ యాత్రకు తీసుకు వెళ్లింది. అయితే ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చైనా భూభాగంలోని హిల్సా ప్రాంతంలో వారిని దింపేసి సదరన్ ట్రావెల్స్ వెళ్లి పోయింది. సాయంత్రం వరకు వారు మళ్లీ రాలేదు.

అయితే మౌంట్ కైలాష్‌కు వెళ్లాలంటే అక్కడి నుండి గుర్రాల ద్వారా వెళ్ల వలసి ఉంటుంది. మౌంట్ కైలాష్ వెళ్లే పరిస్థితులు లేకుంటే వారిని వెనక్కి తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ ట్రావెల్స్ యాజమాన్యం అలా చేయకుండా వారిని అక్కడే వదిలేసి రావడంపై మరో మంత్రి వట్టి వసంత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే వారిని తీసుకు రావడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ పంపించే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుంది.

English summary
Minister Kanna Laxmi Narayana, his two sons, Bimili MLA Avati Srinivas and another 10 tourists at China border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X