వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ వర్గం ఎమ్మేల్యేలు టార్గెట్గా బొత్స, సిఎం కిరణ్ కుమార్ భేటీ
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై కూడా బొత్సకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించుకున్నారు. జిల్లాలవారీగా పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని భావించిన వారు అందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని అనుకున్నారు. జిల్లాలవారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించాలని తలపెట్టారు. ఈ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారని బొత్స సత్యనారాయణ చెప్పారు. సమీక్షా సమావేశాల తేదీలను ముఖ్యమంత్రి ఖరారు చేస్తారని కూడా ఆయన చెప్పారు. వైయస్ జగన్ వెంట వెళ్తారని భావిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.
Comments
botsa satyanarayana kiran kumar reddy congress ys jagan బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు వైయస్ జగన్
English summary
PCC President Botsa Satyanarayana met CM Kiran Kumar Reddy to discuss action to be taken against YS Jagan camp MLAs.
Story first published: Monday, June 20, 2011, 17:22 [IST]