హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం బిర్యానీ తింటాం: హైదరాబాదు వంటావార్పుపై జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
తిరుపతి/ హైదరాబాద్: తెలంగాణవాళ్లు వంటావార్పు చేస్తే తాము బిర్యానీ తింటామని కాంగ్రెసు సీమాంధ్ర శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆయన సోమవారం తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గూడుపుఠానీలు చేయాల్సిన అవసరం తనకు లేదని, వ్యవస్థాపరమైన లోపాలు ఉంటే తాము బహిరంగంగానే మాట్లాడుతానని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాన్ని తెలిపేందుకు త్వరలో ఢిల్లీ వెళతామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ సోమవారం మీడియా ప్రతినిథులకు తెలిపారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలన్న అభిప్రాయం తమలో ఉందని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినని, అయితే తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు ఆదివారం జరిపిన వంటావార్పు మంచి కార్యక్రమేనని అన్నారు. అధిష్ఠానం, కేంద్రం నిర్ణయం తీసుకునే వరకూ కాంగ్రెస్‌ నేతలంతా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

English summary
Congress Seemandhra MLA JC Diwakar Reddy said that they will eat biryani. this comment was made on Telangana Vantaa - vaarpu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X