మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లిదాకా వచ్చి ఆగిపోయిన మిస్స్‌డ్‌ కాల్‌ పెళ్శి కొడుకు వ్యవహారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Medak District
మెదక్‌: మిస్స్‌డ్‌ కాల్‌తో మొదలై సెల్‌ఫోన్‌లో నడిచిన ప్రేమాయణం పెళ్లిదాకా వచ్చి నిలిచిపోయిన సంఘటన మెదక్‌జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే అబ్బాయి పేరు సంకటి శ్రీనివాస్‌. స్వగ్రామం మెదక్‌జిల్లా పుల్లూరు. అమ్మాయి పేరు బోనాల శారద. స్వగ్రామం నాంచారుపల్లి. ఇద్దరికి సెల్‌ఫోన్‌లో పరిచయమయింది. ఇద్దరూ సినిమాలకూ, షికార్లకూ తిరిగారు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకోని ఏకంగా ఇంటికే వచ్చేశాడు మన సంకటి శ్రీనివాస్. ఆ తర్వాత గ్రామస్తుల చేతికి చిక్కడంతో సంకటి శ్రీనివాస్‌కి దేహశుద్ధి చేసి పంపించారు. దీంతో వీరిద్దరకి పెళ్లి చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించడం జరిగింది. రూ.1.10 లక్షలు కట్నానికి అంగీకారం కుదిరింది. పెళ్లికూతురు తరఫువారు రూ.55 వేలు ముందే సమర్పించుకున్నారు. పెళ్శి ముహూర్తం ఆదివారం నిర్ణయిండం జరిగింది.

యధావిధిగా పెళ్లికూతురు తరఫువారు పెళ్లికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఎందుకైనా మంచిదని పెళ్లికి ఒక రోజు ముందు (శనివారం) పెళ్లికూతురు బంధువులు పుల్లూరు వెళ్లారు. ఇంటి దగ్గర పెళ్లికొడుకు జాడ లేకపోవడంతో వారు పెళ్లికొడుకు తండ్రిని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ హైదరాబాద్‌ వెళ్లాడని కనిపించడం లేదని తండ్రి చెప్పడంతో వచ్చిన వారు అవాక్కయ్యారు. విషయాన్ని నాంచారుపల్లికి చేరవేశారు. పెళ్లికూతురుతో సహా అందరూ పుల్లూరు వెళ్లారు. ఏది ఏమైనా తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పెళ్లికూతురు శారద... శ్రీనివాస్‌ ఇంటి దగ్గర బైఠాయిండంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. రెండు కుటుంబాలూ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి.

English summary
In Medak district Missed call ends with marriage proposal in between srinivas and sarada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X