వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస కార్యకర్తలను చితకబాదిన ఎమ్మెల్యే, దేవేందర్‌పై దాడికి యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలను ఇద్దరిని కారులో వేసి తెలుగుదేశం శానససభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి కారులో వేసి చితకబాదారు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై దయాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ కెమెరా ధ్వంసమైంది. తెరాస కార్యకర్తలపై దయాకర్ రెడ్డి అనుచురులు దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమయంలో మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మహబూబ్‌నగర్ రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద తెరాస కార్యకర్తలు గుడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. దేవేందర్ గౌడ్ చేత జై తెలంగాణ నినాదాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జై తెలంగాణ అనిపించాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేయడానికి అక్కడికి వచ్చారు. దేవేందర్ గౌడ్ వచ్చారని తెలిసి తెరాస కార్యకర్తలు అక్కడికి వచ్చారు. తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడిని తెరాస నాయకులు ఖండించారు.

English summary
TDP MLA Kothakota Dayakar Reddy attacked TRS workers at Mahaboobnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X