Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెరాస కార్యకర్తలను చితకబాదిన ఎమ్మెల్యే, దేవేందర్‌పై దాడికి యత్నం

Telangana
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలను ఇద్దరిని కారులో వేసి తెలుగుదేశం శానససభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి కారులో వేసి చితకబాదారు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై దయాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ కెమెరా ధ్వంసమైంది. తెరాస కార్యకర్తలపై దయాకర్ రెడ్డి అనుచురులు దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమయంలో మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మహబూబ్‌నగర్ రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద తెరాస కార్యకర్తలు గుడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. దేవేందర్ గౌడ్ చేత జై తెలంగాణ నినాదాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జై తెలంగాణ అనిపించాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేయడానికి అక్కడికి వచ్చారు. దేవేందర్ గౌడ్ వచ్చారని తెలిసి తెరాస కార్యకర్తలు అక్కడికి వచ్చారు. తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడిని తెరాస నాయకులు ఖండించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+