విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కాన్వాయ్‌లో గందరగోళం, ఢీకొన్న ప్రైవేటు వాహనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాహన శ్రేణిలోకి మూడు ప్రయివేటు వాహనాలు రావడంతో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం విజయవాడ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాహన శ్రేణి సింగ్ నగర్ ఫ్లై ఓవర వద్ద నుండి వెళుతున్న సమయంలో మూడు ప్రయివేటు వాహనాలు చొచ్చుకు వచ్చాయి. దీంతో వాహన శ్రేణిలో కాస్త గందరగోళం చెలరేగి మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ముఖ్యమంత్రి వాహన శ్రేణి అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంఖుస్థాపన కార్యక్రమంలో కూడా కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. యనమలకుదురు వద్ద వంతెన శంఖుస్థాపన చేయబోతున్న ముఖ్యమంత్రిని గ్రామస్థులు అడ్డుకున్నారు. కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా అంతకుముందు విజయవాడలో రూ.21 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదిలోనే కొత్తగా 16 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తూ మార్గమధ్యంలో పులిచింతల ప్రాజెక్టు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఈడ్పుగల్లులో రూ.313 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే వెయ్యి స్కూళ్ల భవనాలకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈరోజు రాత్రి పదిన్నర గంటల వరకు విజయవాడలో సీఎం పర్యటన కొనసాగుతుంది.

English summary
Disrupt take place in Chief Minister Kiran Kumar Reddy convoy today in Vijayawada with three private vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X