హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు మాయావతి మద్దతు, దళితులకే సిఎం పీఠమని ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) నేత మాయావతి పూర్తి మద్దతు ప్రకటించారు. హైదరాబాదు వచ్చిన ఆమె బిఎస్‌పి కార్యకర్తల సమావేశంలో శనివారం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పడితే తమ పార్టీ బలపడుతుందని ఆమె అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే దళితులకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, చిన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులకు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో యుపిఎ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆమె విమర్శించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును ఆమె విమర్శించారు.

English summary
BSP president, Uttar Pradesh CM Mayawati supported demand of formation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X