తెలంగాణ ఇష్యూ: ఆజాద్‌తో దామోదర భేటీ, ఢిల్లీలో బిజీ?

Damodara Rajanarasimha
ఢిల్లీ: తెలంగాణ అంశానికి పరిష్కారం కనుక్కునే దిశలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో కలుస్తూ ఢిల్లీలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఆయన ఆ తర్వాత వరుసగా వివిధ నాయకులతో సమావేశమవుతున్నారు. మంగళవారం ఉదయం మరోసారి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి, దానికి దామోదర రాజనర్సింహను చైర్మన్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దామోదర రాజనర్సింహ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

గులాం నబీ ఆజాద్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిస్థితులను వివరించినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం ఉదయ ఆజాద్‌, రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్పతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఆజాద్‌ రాష్ట్ర పర్యటనలో అందరితో సంప్రదింపులు జరిపి తర్వాత తగు నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. మునియప్ప మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల్లో పటాన్‌చెరు నుంచి అక్కన్నపేట వరకు రైల్వే లైన్‌ సర్వే పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+