వారెప్పుడు ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలుసు: హరీష్

కేంద్ర బలగాలను వెనక్కి పంపించాల్సిందేనని హరీష్ రావు అన్నారు. 14ఎఫ్ తొలగించిన తర్వాత ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ విద్యార్థులు నష్టం పోతారన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు తాము వ్యతిరేకించడం లేదని అయితే ఫుట్ పాత్ వ్యాపారులకు నష్టం కలిగించకుండా, హైదరాబాద్ చారిత్రక సంపదకు నష్టం కలిగించకుండా అలైన్ మెంట్ మార్చాలని కోరుతున్నట్లు చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ శాడిస్టు అన్నారు. కాగా ఆచార్య జయశంకర్కు నివాళుల అర్పించేందుకు టిఆర్ఎస్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications