కాంగ్రెసు రాజకీయాలు: సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ

కాగా, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ కార్యాచరణను రచించుకునే వ్యూహంలో పడ్డారు. ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాలని వారు అనుకున్నారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. నిరవధిక నిరాహార దీక్షలు, రాజీనామాలతో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని ఓ వర్గం ఆలోచిస్తుండగా, మరో వర్గం అంతటి తీవ్రమైన కార్యాచరణకు దిగడానికి విముఖత ప్రదర్శిస్తోంది. తాము అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వారు గురువారం హైదరాబాదులో సమావేశమయ్యారు.
మరోవైపు, కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ ఇదివరకే మంత్రి జానారెడ్డి కలిసి చర్చలు జరిపారు. తాజాగా, కోదండరామ్ శుక్రవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వివేక్ కూడా హాజరయ్యారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడితేనే కాంగ్రెసు అధిష్టానం దిగివస్తుందని, అందుకు సిద్ధపడాలని కోదండరామ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా కేశవరావును కలిశారు. అటు ఢిల్లీలో కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతుండగా, ఇటు హైదరాబాదులో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.












Click it and Unblock the Notifications