రాజీనామాల నిర్ణయంపై బొత్స సానుకూల వ్యాఖ్య

తెలంగాణ సమస్యకు రాజీనామాలు పరిష్కారం కాదని, తొందరపడవద్దని తాను వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎవరిని కలవాలో వారిని కలవాలని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. రాజీనామాలపై పునరాలోచన చేయాలని కూడా తాను సూచించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 8 కోట్ల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని ఆయన పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు చెప్పారు. అందరికీ మంచి జరిగే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications