రాజీనామాలు చేయకుంటే తరిమికొడ్తారు: కెసిఆర్

K Chandrasekhar Rao
వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులను ప్రజలు తరిమికొడ్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. రాజీనామాలు చేసే నాయకుల వెంట ప్రజలు ఉంటారని ఆయన అన్నారు. వరంగల్లులోని ఏకశిలా పార్కులో శనివారం జరిగిన జయశంకర్ సంతాపసభలో ఆయన మాట్లాడారు. జయశంకర్ జీవించి ఉంటే ప్రస్తుత పరిణామాలకు ఎంతో ఆనందించి ఉండేవారని ఆయన అన్నారు. జయశంకర్ ఉద్యమ శిఖరమని ఆయన అన్నారు. నమ్మినదాని కోసం జీవితాంత కట్టుబడి పనిచేసిన వ్యక్తి జయశంకర్ అని, అటువంటి మహానుభావులు తక్కువగా ఉంటారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పిద్దామని ఆయన అన్నారు. జయశంకర్ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని, అయితే భగవంతుడు అందుకు సహకరించలేదని ఆయన అన్నారు. వరంగల్లు జిల్లాకు జయశంకర్ పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందుకు ముందుకు రాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ పేరు పెడుతామని ఆయన అన్నారు. వరంగల్లు ఏకశిలా పార్కులో ఆయన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+