మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్

మంత్రి దానం నాగేందర్ తమ సమావేశాలకు గత రెండేళ్లలో ఎప్పుడూ రాలేదని, ఇద్దరో ముగ్గురో మంత్రులు తమ సమావేశాలకు రావడం లేదని, ఆ విషయం అందరికీ తెలుసునని, వారిని ప్రజలు చూసుకుంటారని, కొత్తగా ఆ మంత్రులు రావడం లేదని ఎందుకు అడుగుతారని ఆయన అన్నారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని ఆయన చెప్పారు. శుక్రవారం సమావేశంలో 21 మంది సభ్యులు రాజీనామాకు ఆమోదించారని ఆయన చెప్పారు. మీడియా పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం కూడా అన్నారు. తాము 11 మంది పార్లమెంటు సభ్యులం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేశామని, ఇప్పుడు కూడా తాము కలిసే ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications