వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నేతల రాజీనామాలపై స్పందించని బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాపై ఆదివారం స్పందించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై మహానాడులోనే స్పష్టం చేశామని చెప్పారు. చంద్రబాబు ఆదివారం అన్నాహజారే బృందంతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై స్పందించలేదు. లోక్ పాల్ బిల్లుకు మద్దతు ఇవ్వమని కోరుతూ తనను అన్నాహజారే బృందం కలిసిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. దేశానికి పట్టుకున్న అతిపెద్ద సమస్య అవినీతి అన్నారు. అది తీవ్రవాదం కంటె భయంకరమైనదని అన్నారు.

అవినీతిపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. 1991కు ముందు కాంగ్రెసు పార్టీ ఏకపక్ష పాలనలో రాష్ట్ర అభివృద్ధి కేవలం ఒకటి, రెండు శాతం మాత్రమే ఉండేదన్నారు. లోక్ పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ పాల్‌పై కేంద్రం బురద జల్లడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కుంభకోణాల్లో మునిగి పోయాయన్నారు. అవినీతికి కాంగ్రెసుదే పూర్తి బాధ్యత అన్నారు. హజారే మళ్లీ దీక్షకు దిగకుండా కేంద్రం బిల్లుకు అడ్డంకులు సృష్టించకూడదన్నారు. లోక్ పాల్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, లోక్ పాల్ పరిధిలోని కేసులకు కాల పరిమితి ఉండాలని డిమాండ్ చేశారు.

English summary
TDP chief Chandrababu Naidu not respond on Telangana leaders resignations. He met with Anna Hazare team today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X