వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెకె కెసిఆర్ ఏజెంట్, వారి లక్ష్యమదే: జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Toorpu Jayaprakash Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆదివారం మాట్లాడుతూ ధ్వజమెత్తారు. కెకెతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 2004 సంవత్సరం నుండి కెకె, కెసిఆర్ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలు చేయడం అసాంఘిక చర్య వంటిదన్నారు. రాజీనామాలతో తెలంగాణ రాదన్నారు. పదవులలో ఉండే తెలంగాణ కోసం ఉద్యమించాలని సూచించారు. కెకెకు తెలంగాణపై చిత్తశుద్ది లేదన్నారు.

రాజీనామాల పరంపర కెసిఆర్‌తోనే ప్రారంభం అయిందన్నారు. రాజీనామాలు చేయడం వల్ల తెలంగాణ రాదని కెసిఆర్ వేసిన ట్రయల్స్ కూడా తెలిపాయన్నారు. పార్టీ నాయకులను కించపర్చడం టి-కాంగ్రెసుకు సరికాదన్నారు. చట్టసభల ద్వారా తెలంగాణ సాధిద్దామని అన్నారు. మీడియాలో గొంతు చించుకున్నంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని కెసిఆర్ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్‌ను అధికారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు కెకె మానుకోవాలని సూచించారు.

English summary
Sangareddy MLA Toorpu Jayaprakash Reddy accused that K Keshava Rao is TRS president K Chandraasekhar Rao's agent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X