ఈరోజే రాజీనామా: దీక్షస్థలి వద్ద నాగం ప్రకటన
సోమవారం తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి చరిత్ర సృష్టించనున్నారని అన్నారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్రనేతలు ఐక్యంగా అడ్డుకున్నారని, ఇప్పుడు తెలంగాణ నేతలు కూడా ఐక్యంగా తెలంగాణ సాధించాలని అన్నారు. దోచుకోవడానికే సీమాంధ్ర నేతలు సమైక్య నినాదం వినిపిస్తున్నారని అన్నారు. ముల్కీ రుల్సు, 610 జివో తదితర ఒప్పందాలను తుంగలో తొక్కిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు సమైక్య నినాదం వినిపించి తెలంగాణను అభివృద్ధి చేస్తాననడంలో స్వార్థం తప్ప ఏదీ లేదన్నారు.
కాగా కాంగ్రెసు పార్టీ రాజీనామాకు సిద్ధమైన సందర్భంలో తాము కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము అందరికంటే ముందే రాజీనామాలు చేస్తున్నట్లు నాగం చెప్పారు. దీక్షాస్థలి నుండి ఇప్పుడే తాము రాజీనామాలు పంపుతామని నాగం చెప్పారు. నాగంతో పాటు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలరావు, జోగు రామన్న రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.