వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపి రాజకీయాలపై సోనియా అత్యవసర భేటీ

ఇప్పటికే టి-కాంగ్రెసు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు అధిష్టానం చేసింది. కేంద్రమంత్రులు, రాష్ట్ర పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి తదితరులు తమ తమ ప్రయత్నాలు చేసినప్పటికీ టి-కాంగ్రెసు వెనక్కి తగ్గలేదు. రాత్రంతా ఫోన్లో రాయబారాలు నెరిపింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డినీ రంగంలోకి దింపారు. దీంతో సోనియా గాంధీ ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా ఉండటానికి ఇంకా ఏం చేయాలి. ఒకవేళ వారు రాజీనామా చేసినా తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై టి-నేతలు గుర్రుగా ఉన్న విషయంపై చర్చించే అవకాశం ఉంది.