కిరణ్ కుమార్ రెడ్డి అప్రమత్తం, స్థితిపై సమీక్ష

హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ హైదరాబాదులో నిషేదాజ్ఞలు విధించారు. ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆయన ఆదేశించారు. వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బంద్ నేపథ్యంలో హైదరాబాదులోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద యెత్తున క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆందోళనకారులను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని ఢిల్లీలో ఉన్న డిజిపి దినేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications