ఆంధ్రలో రాష్ట్రపతి పాలన రాదు: చిదంబరం

P Chidambaram
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన రాదని కేంద్రమంత్రి చిదంబరం బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన గురించి ఆలోచించడం లేదన్నారు. సంప్రతింపులు, చర్చల ద్వారానే తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. సమస్యకు త్వరలో పరిష్కారం లభించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి దినేష్ రెడ్డి తనను మర్యాద పూర్వకంగానే కలిశారని స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య పెద్దగా లేదన్నారు. చిన్నపాటి సంఘటనలు మినహా ఏమీ జరగలేదన్నారు.

బందులు, ఆందోళనలు ఉన్నందునే కేంద్ర బలగాలను పంపించవలసి వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఆందోళనకారులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దని కోరారు. రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలుపై మాట్లాడేందుకు చిదంబరం నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+